ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ
గంగా ప్రవాహం లా నిత్యం జరిగే మా శ్రీ మద్ భాగవతం ఇప్పుడు దశమ స్కంధం లో ఉత్తర భాగం లో బలరాముడు తీర్ధ యాత్ర లోకి వచ్చాము.
సాధారణం గా మనం పుణ్యకేత్రం కి వెళ్ళినప్పుడు చెయ్యవలసిన పనులు లో ముఖ్యం గా
దానము , జపము, తర్పణం స్నానం లాంటివి ముఖ్యమైనవి అది చేస్తేనే అది తీర్ధ యాత్ర అవుతుంది.. లేకపోతె అది విహార యాత్ర అవుతుంది..
బలరామావతారము అంటే మహావిష్ణువు ఎత్తిన దశ అవతారాలలో ఇది ఒకటి. శ్రీమహావిష్ణువు యొక్క శ్వేతతేజస్సు బలరాముడుగానూ, నీలతేజస్సు శ్రీకృష్ణుడిగానూ అవతరించి దుష్టశిక్షణ కోసం తమ అవతార కాలాన్నంతా సద్వినియోగం చేసినట్లుగా అనిపిస్తుంది. బలరాములు వారు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులుగా జన్మించిన అంశావతారము. వీరి ఆయుధము హలము , నాగలి. వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడు గా ఉన్నవారు.
ఒకసారి కోపం వచ్చి యమునా నది దిశ మార్చినారు, వీరు కురుక్షేత్ర యుద్దమప్పుడు శాంతి కాముకులై తీర్థ యాత్రలు చేసినారు. శ్రీకాకుళం జిల్లా నాగావళి నది ఆవిర్భావానికి … నాగావళి నదీతీరాన పంచలింగాల ప్రతిష్టకి ఈయనే కారణము
భారత భాగవతాలలో శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రస్తావన వచ్చిన కొన్ని కొన్ని సందర్భాలలో బలరాముడిని గురించి కూడా కొన్ని వివరణలు, కథలు కనిపిస్తాయి. బలరాముడు భగవానుడి దశావతారాలలో ఒక అవతారంగా కూడా ఉన్నాడు.. దేవకీదేవికి సప్తమగర్భం కలిగింది. అప్పుడు దేవకిని, వసుదేవుడిని కంసుడు చెరసాలలో బంధించాడు. ఆ సమయంలో యముడు తన యామ్యమైన మాయతో దేవకీదేవి నుంచి గర్భాన్ని ఆకర్షించి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. బలరాముడికి ఈ సందర్భంలోనే సంకర్షణుడు అనే పేరు వచ్చింది. సంస్కృత మర్యాద ప్రకారం సమ్యక్ కర్షణాత్ అంటే సంపూర్తిగా ఆకర్షించడం వల్ల ఆయన సంకర్షణుడు అనే పేరుతో కూడా మనకు కనిపిస్తాడు.
బలవంతులందరిలోనూ శ్రేష్టుడు కనుక బలదేవుడు అన్నారు. రామశబ్దానికి సుందరం అనే అర్ధం ఉంది కనుక ఆయన బలరాముడయ్యాడు. శ్రీకృష్ణుడికి అన్న అయిన బలరాముడు ఆదిశేషుడి అవతారం కూడా. సాందీపుడు అనే గురువు దగ్గర బలరామకృష్ణులిద్దరూ విద్యాభ్యాసం చేశారు. ఈ బలరాముడు శ్రీకృష్ణుడిలాగే పాండవులంటే కొంత ఆదరాభిమానాలు కలిగివున్నా ఈయనకు కౌరవులలో దుర్యోధనుడంటే కూడా బాగా ఇష్టం అని కొన్ని కొన్ని భారత కథాఘట్టాల వల్ల తెలుస్తుంది. ఈయన భార్య పేరు రేవతీదేవి. నాగలి, రోకలి, బలరాముడి ప్రధాన ఆయుధాలు. బలరాముడు ఎప్పుడూ నీలరంగు వస్త్రాలనే ధరిస్తుంటాడు. ఈయన జండామీద తాటిచెట్టు గుర్తు ఉంటుంది.
బలరాముడు గదాయుద్ధ ప్రావీణ్యుడు
గధాయుద్ధంలో బలరాముడు గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించాడు. భీముడు, దుర్యోధనుడు ఇద్దరూ ఈయన దగ్గర గదాయుద్ధ విద్యను నేర్చుకున్నారు. విశేషించి దుర్యోధనుడు, పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు భీముడిని జయించాలన్న లక్ష్యంతో ఈయన దగ్గర ఎన్నెన్నో గదాయుద్ధ మెళుకవలను నేర్చుకున్నాడు.
కురుక్షేత్ర సమయంలో తీర్థయాత్రలు చేసిన బలరాముడు,
అలా తీర్ధయాత్రలకు అని బయలుదేరిన బలరాముడు, ప్రభాసతీర్ధానికి వెళ్ళి స్నానం చేసి ప్రీతితో దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు వదిలాడు. బ్రాహ్మణోత్తములు కూడా వస్తుండగా అతడు అక్కడ నుండి బయలుదేరాడు. క్రమముగా సరస్వతి, బిందుసరోవరం, వజ్రతీర్థం, విశాలానది, సరయువు, యమున, గంగ మున్నగు పుణ్యనదుల్లో స్నానాలు చేసి, దేవతలకు, ఋషులకు, పితృగణాలకు తర్పణాలు సమర్పించాడు. బ్రాహ్మణులకు సంతర్పణలు చేసాడు. పిమ్మట బలరాముడు లోకములు సమస్తము నందు స్తుతిపాత్రము, మునీంద్రులకు నివాసస్థానము అయిన నైమిశారణ్యం ప్రవేశించాడు. అప్పుడు అక్కడి మునులు దీర్ఘసత్రయాగం జరుపుతూ ఉన్నారు. వారందరూ బలరాముడికి ఎదురేగి వినయంగా స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశారు. బలరాముడు సంతోషించి సపరివారంగా ఆసీనుడయ్యాడు.
గోమతీం గండకీం స్నాత్వా విపాశాం శోణ ఆప్లుతః | గయాం గత్వా పితౄనిష్ట్వా గంగాసాగరసంగమే ॥ ఉపస్పృశ్య మహేన్ద్రదౌ రామం దృష్ట్వాభివాద్య చ ॥ సప్తగోదావరీం వేణాం పంపాం భీమరథీం తతః ॥ స్కన్దం దృష్ట్వా యయౌ రామః శ్రీశైలం గిరిశాలయం | ద్రవిడేషు మహాపుణ్యం దృష్ట్వాద్రిం వేంకటం ప్రభుం ॥ కామకోష్టీం పురీం కాంచీం కావేరీం చ సరిద్వరాం | శ్రీరంగాఖ్యం మహాపుణ్యం యత్ర సన్నిహితో హరిః IIఋషభాద్రిం హరేః క్షేత్రం దక్షిణాం మథురాం తథా! సాముద్రం సేతుమగమత్మాహాపాతకనాశనం ॥
బలరాముడు గోమతి, గండకి, విపాశ నదులలో స్నానమాడెను రో యందును అతడు క్రుంకులిడెను. గయకు వెడలి ఆతడు పితరులను ఆరాధించెను. గంగాసాగర సంగమ స్థానమున ఆతడు పవిత్రస్నానము కావించెను. మహేంద్ర పర్వతము చెంత అతడు పరశురాముని దర్శించ స్తోత్రము కావించెను. పిదప సప్త గోదావరులలో స్నానమాడి వేణ, పంపు భీమారథి యను నదులలో కూడ అతడు స్నానమాడెను. పిమ్మట బలరాముడు. స్కందుని కలిసికొని గిరీశుని ధామమగు శ్రీశైలమును దర్శించెను. ద్రవిడదేశమని తెలియబడు దక్షిణ ప్రాంతమున అతడు పవిత్ర వేంకటాచలమును, అట్లే కామకోష్టిని, కాంచీపురమును, నదీశ్రేష్ఠమగు కావేరిని, సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అవతరించియున్నట్టి పరమ పవిత్రము శ్రీరంగ క్షేత్రమును దర్శించెను. అచట నుండి అతడు హరిక్షేత్రమగు ఋషభ పర్వతమునకు, దక్షిణ మథురకు వెడలెను. తరువాత అతడు మహాపాతక నాశనమగు సేతుబంధమునకు చేరెను.
నలభైరెండురోజుల తీర్థయాత్ర ముగించుకొని కురుక్షేత్ర సంగ్రామం చిట్టచివరిలో భీముడు, దుర్యోధనుడు గదాయుద్ధం చేసుకునే సమయానికి తిరిగి వచ్చాడు.
మనకి శ్రీ మద్ భాగవతం లో మన ధర్మ ఆచరణములు ఎలా నిర్వర్తి0చాలో తెలియచేసింది
ఇట్లు
శివ పరివారం