SIVAPARIVARAM
Wednesday, January 21, 2026
విశ్వదాభిరామా వినురావేమా యోగి వేమన.
Sunday, November 23, 2025
నా డైరీ లో ఈ రోజు.. ఆ రోజు 21st , 22nd నవంబర్ ,
నా డైరీ లో ఈ రోజు..
ఆ రోజు 21st నవంబర్ , ఈ రోజు ప్రయాణం కోసం చాల రోజులు క్రితం రిజర్వేషన్ చేసుకున్నాను , ఎందుకంటే మా అమ్మాయి డాన్స్ ప్రోగ్రాం 22 నవంబర్ శుక్రవారం నాడు.. మా బాస్ ని అడిగి సెలవు తీసుకున్నాను.. వర్క్ ని వారం రోజులు ముందు నుంచి ముగించుకుని వచ్చాను.. సో గురువారం మధ్యాహ్నం భోజనం చెస్ సాయంత్రం 6 ki ట్రైన్ అయితే బెంగళూరు లో 3 గంటలు ముందు బయలుదేరాలి . ట్రాఫిక్ ని మనం అంచనా వెయ్యలేము.. జస్ట్ నేను వెళ్లే టైం కి ట్రైన్ వచ్చేసింది.. 5 ని లో కదులుతుంది అంటే ట్రైన్ ఎక్కాను.. అదో పెద్ద challange ఇక్కడ.. సరే శుక్రవారం ఉదయం కి చేరుకున్నాను.
ఎందుకంటే శుక్రవారం చాల tight షెడ్యూల్ పెట్టుకున్నాను . ఒక జాబ్ ఇంటర్వ్యూ ఉంది. మా అమ్మాయి డాన్స్ ప్రోగ్రాం ఉంది.. ఇంకా ఊర్లో చాల పనులు పెట్టుకున్నాను.. దానికి తోడు నాకు బండి లేదు.. అన్నిటికి ఆటో లేదా బైక్ బుక్ చేసుకుని వెళ్ళాలి..
ఇక ఇంటర్వ్యూ కి రెడీ అయ్యి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ కి వెళ్ళాను.. HR తో ఫైనల్ రౌండ్ అని.. అక్కడికి వెళ్ళాక వాళ్ళు HR అండ్ HOD ఫైనాన్ల్ రౌండ్ ని పోస్టుపోన్ చేసారు.. చాల కోపం వచ్చింది.. ఎందుకంటే అంత రెడీ చేసుకుని , సమయం వెచ్చించి , సిద్ధం గా ఉంటె ఇలా ప్రోగ్రాం డిలే అయితే ఎవరికైనా కోపం వస్తుంది.
అసలే నేను టైం ని calculate చేసుకునే వాడిని. ఇక మధ్యాహ్నం కి ఇంటికి రావడం అమ్మాయి డాన్స్ ప్రోగ్రాం కి రెడీ అవుతున్నాను..ఇంట్లో పరిస్థితి తెలుసు కదా ఎక్కడివి అక్కడే వస్తువులు పడేస్తాము.. చేసే వాళ్ళు ఉండరు.. మనది మనమే చేసుకోవాలి.. శ్రీ లతా కూడా అప్పుడే వచ్చింది. ఈ మధ్య పిల్లలు కూడా మన మాట వినే స్టేజి దాటిపోతున్నారు.. మొబైల్ కూడా వాళ్ళని వాళ్ళ చదువుని , సంస్కారాన్నై అన్నీ దూరం చేస్తున్నాయి.. మనం పని చెప్పినా ఓఓఓ ,ఉఉఉఉ అంటారు కానీ చెయ్యరు.. వినరు..
సరే ఇంతకీ నాకు ఫొటోస్ , పిచ్చి.. మా అమ్మాయికి మంచి ఫొటోస్ తీయాలని ఎప్పటినుంచో అడుగుతోంది.. సరే అని మొహమాటం తో రంజాన ని కెమెరా అడిగాను.. అది కూడా మా శ్రీలత వద్దు అని చెప్పింది.. ఏమి ఫరవాలేదు లే.. రంజన ఇస్తుంది అని చెప్పను. తాను చెప్పింది ఛార్జింగ్ పెట్టుకోవాలి అని , కానీ నేను సరే అని ఊరుకున్నాను.. ఇంటికి రాగానే సూర్య కి చెప్పి కెమెరా లో బాటరీ ని ఛార్జింగ్ పెట్టు అని చెప్పి వేరే పనికి వెళ్ళాను.. సరే వాడు ఛార్జ్ పెట్టాడు. స్విచ్ కొంత సేపు అయ్యాక ఎదో ఆలోచిస్తూ ఆఫ్ చేసాడు.. ( స్పైక్ బార్ ) .. నా దగ్గర ఒక మెమరీ కార్డు ఉంది.. ఒక్కసారి బ్యాక్ అప్ తెయ్యరా అని చెప్పను.. ఊ అని చెయ్యలేదు..
అదే రోజు నేను చాల టెన్షన్ లో హడావిడి లో మొబైల్ ని రెండు మూడు సార్లు మర్చిపోయాను.. దానికీ వాడు విసుకున్ని తెచ్చాడు.
ఇక అసలు స్టోరీ మొదలైంది.. మా అమ్మాయి డాన్స్ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది.. ఫొటోస్ తీద్దాం అని స్టార్ట్ చేశాను.. 3 ఫొటోస్ తీసాను.. బాటరీ ఛార్జింగ్ అయ్యిపోయింది. చూసాను మా సూర్య ఇంకో బాటరీ ఛార్జింగ్ పెట్టి adaptor ని ఇంట్లో స్విచ్ కి ఉంచేసాడు.. సరే ఇంకో బాటరీ తో కొంత తీసాను.. మెమరీ కార్డు నా కార్డు వేసి ఫొటోస్ తీసాను.. ఫుల్ అని వచ్చింది.. సరే రంజన మెమరీ కార్డు లో తెయ్యచ్చు అని చూసాను.. అనుకోకుండా వీడియో తీసాను.. చీకటి , జనాలు ఫుల్ struck అయ్యింది.. వీడియో డిలీట్ చేద్దాం లే ప్లేస్ కలిసి వస్తుంది అనుకున్నాను . ఆ డిలీట్ చెయ్యడం లో ఫార్మటు చేశాను.. అప్పటికి నా bp హై అయిపొయింది.. చీకటి.. సరే కొన్ని ఫొటోస్ తీద్దాం అని చూసే సరికి బాటరీ నిల్. ఈ హడావిడి లో ఒక మెమరీ కార్డు నా చేతిలోంచి జారిపోయింది.. చీకట్లో కనబడలేదు. ప్రోగ్రాం అంత అయ్యేక రాత్రి 11 వరకు వెతికాను.. చివరికి నాకు మా ఆవిడకి గొడవ.. మా బావ వచ్చి సర్ది చెప్పి ఇద్దరినీ కార్ లో తీసుకుని రావడం జరిగింది .
సారాంశం ఏమిటంటే
సో మొత్తానికి మనం ఏదైతే ఆరాట పడతామో , అతిగా చేద్దాం అనుకుంటామో , ఇష్ట పడతామో అది మన చేతికి రాదు.. చేయలేము.. ఈశ్వర సంకల్పం ఉండాలి.. అదృష్టం ఉండాలి. మొత్తానికి మా అమ్మాయికి నా మొబైల్ లో తీసిన కొన్ని ఫొటోస్ మాత్రమే వచ్చాయి.. ఇంచుమించు నెల రోజులు నుంచి ప్లాన్ చేసుకుంటే చివరికి ఇలా జరిగింది.. నేను ఎప్పుడు బాధపడలేదు.. కానీ మెమరీ కార్ మిస్ అయింది. మా రవి రంజన ఏమంటారో అని భయపడుతూ భగవంతుడు కి క్షమాపణ చెప్పుకున్నాను.. నాకు ఏది జరిగినా నా డైరీ లో రాసుకోవడం నా అలవాటు.. రేపు అన్నరోజున ఏమి జరిగిందో తెలుసుకోవాలి కదా..
Tuesday, January 31, 2023
బీష్మ ఏకాదశి
కురుక్షేత్ర సంగ్రామంలో తీవ్రంగా గాయపడి, తన ఇష్టానుసారం కురు పితామహుడు భీష్మాచార్యుడు గతించిన రోజు భీష్మ ఏకాదశి. తిథి నక్షత్రాలను, వార వర్జ్యాలను పాటించేవారు ఏకాదశిని మంచిరోజుగా భావిస్తుంటారు. భీష్మ ఏకాదశిని మరింత పవిత్రమైన రోజుగా భావిస్తారు. భీష్మ ఏకాదశికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ఉంది.
భీష్ముడి గురించి తెలియని వారుండరు. మహాభారతంలో భీష్ముడిది చాలా గొప్ప పాత్ర. మహాభారత గాథకు మూల స్తంభమైన భీష్ముడు పుట్టగానే గంగాదేవి వెళ్ళిపోతుంది. ఇతని మొదటి పేరు దేవపుత్రుడు. శంతనుడు దాసరాజు కుమార్తె సత్యవతిని ఇష్టపడతాడు. ఆమెతో తండ్రి వివాహం కోసం దేవపుత్రుడు రాజ్యాన్ని వదులుకుని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటినుంచి గాంగేయుడు ‘భీష్ముడు’ అయ్యాడు.
సత్యవతితో తన వివాహం కోసం సామ్రాజ్యాన్ని వైవాహిక జీవితాన్ని కుమారుడు భీష్ముడు త్యాగం చెయ్యడంతో శంతనుడు బాధపడతాడు. ఇంత త్యాగం చేసిన కుమారునికి స్వచ్చంద మరణాన్ని వరంగా ప్రసాదిస్తాడు. అనంతరం పాండవులు, కౌరవులకు కురుక్షేత్రంలో మహాసంగ్రామం జరుగుతుంది. ఆ యుద్దంలో పదిరోజులు తీవ్రంగా యుద్ధం చేసిన భీష్ముడు అర్జునుని ధనుర్భాణానికి నేలకొరిగి శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయిస్తాడు. దీన్ని తలపునకు తెచ్చేది ఏకాదశి వ్రతం.
కార్తీక శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయించిన భీష్ముడు మాఘశుద్ధ అష్టమి నాడు మరణించినట్టుగా పలు పురాణ గ్రంథాల్లో పేర్కొన్నారు. ఉత్తరాయణం మాఘశుద్ధ అష్టమి రోజు ప్రవేశించినట్టుగా ప్రమాణాలు ఉన్నాయి. నిర్ణయ సింధువులలోనూ, భీష్మ సింధువులలోనూ, ధర్మ సింధువులలోనూ మాఘ శుద్ధ అష్టమినాడు భీష్మునికి తిలాంజలి విడిచి పూజించాలని ఉంది.
భీష్మాష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధ కర్మలు చేసినవారికి సంతానాభివృద్ధి జరుగుతుందని, పుణ్యం ప్రాప్తిస్తుందని పలువురు అంటున్నారు. ఈ కారణంగా భీష్మ ఏకాదశి, భీష్మాష్టమి పుణ్యదినాలయ్యాయి. పలు పర్వదినాలున్నా అన్నింటినీ అందరూ చేసుకోన్నట్లే భీష్మ ఏకాదశిని కూడా బ్రాహ్మణ, క్షత్రియులే పాటిస్తూ వస్తున్నారు. సంతాన భాగ్యానికి దూరమై మరణించిన భీష్మునికి వారసులమని క్షత్రియులంతా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున భీష్మునికి తర్పణం వదలటం ఆనవాయితీ. అయితే భీష్ముడు మరణించిన రోజున బ్రాహ్మణులు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశినాడు ఉపవాస దీక్ష విరమిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో క్షత్రియులు భీష్మ ఏకాదశి రోజున పండితులను పిలిపించుకుని భీష్ముని జన్మ వృత్తాంతాన్నంతా చెప్పించుకుంటున్నారు. సంతాన ప్రాప్తిని కోరే చాలామంది బ్రాహ్మణ, క్షత్రియేతరులు కూడా భీష్మ ఏకాదశిని పాటిస్తున్నారు.
***********************************************
భీష్మ ఏకాదశి
||ॐ||ఓం నమోనారాయణాయ || ॐ ||
ॐ అంపశయ్యపై శయనించిన భీష్ముడిని చూడడానికి శ్రీ కృష్ణ పరమాత్మ, ధర్మరాజు వెళ్ళినప్పుడు భీష్ముడి నోటి ద్వారా ధర్మరాజుకి, ఈ లోకానికి ధర్మము, భక్తి గొప్పతనముతెలియపరచాలని, అలాగే భీష్ముడు గొప్పతనం ఈ లోకానికితెలియపరచాలని భావించాడు.
ॐ భీష్మునిలోనిభగవతత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయన నెంతగానో ప్రశంసించాడు. అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహం తోనే సాక్షాత్తూ ధర్మదేవత తనయుడే అయిన ధర్మరాజు కు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు భీష్ముడు. వర్ణాశ్రమ ధర్మాలు, రాజ ధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్ష ధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్ర్తీ ధర్మాలు, దాన ధర్మాలు, ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మసందేహాలన్నింటినీ తీర్చి చక్కటి సమాధానాలిచ్చాడు భీష్ముడు. చక్కటి కథల రూపం లో… వినగానే ఎవరైనా అర్ధం చేసుకోగల తీరులో అవన్నీ మహా భారతం శాంతి, అనుశాసనిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి. అప్పుడు ధర్మరాజు భీష్మునితో
ॐ “కిమేకిం దైవతం లోకే” అంటే ఈ లోకంలో అందరికంటే గొప్పదైవం ఎవరు?గొప్ప దైవం అంటే బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, వరుణ మొదలైన దేవతలు అందరి చేత పూజింపబడే దైవం ఎవరు?
ॐ “కింవా ప్యేకం పరాయణం”- ఈ లోకంలో అందరి గమ్యస్థానం ఏది? ప్రతి జీవుడు(ఆత్మ) చేరుకోదగిన గమ్యస్థానం ఏమిటి?
ॐ స్తువంతః కః -ఎవరిని స్తుతించడం వలన
ॐ కం అర్చయంతః – ఎవరిని అర్చించడం/ పూజించడం వలన
ॐ ప్రాప్యుః మానవః శుభం – మనిషికి సర్వశుభాలు కలుగుతాయి.
ॐ కో ధర్మః సర్వ ధర్మాణాం భవతః పరమో మతః – అన్ని ధర్మాల్లోకెల్లా ఏ ధర్మం ఉత్తమమైనది,గొప్పదని మీ అభిప్రాయం?
ॐ కిం జపం ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ – ఎవరి నామజపం చేయడం వలన ఈ అనేక మార్లు జన్మించే అవస్థ నుంచి విముక్తి లభిస్తుంది?
అని అడుగుతాడు.
ॐ జగత్ ప్రభుం – ఈ జగత్తుకు ప్రభువైన వాడు
ॐ దేవదేవం – దేవతలకు కూడా దేవుడు, దేవతలచే ఆరాధించబడేవాడు
ॐ అనంతం – అంతం అంటూ లేని వాడు, అంతటావ్యాపించి ఉన్నవాడు
ॐ పురుషోత్తమం అందరిలో కెల్లా ఉత్తమమైనవాడు, మోక్షాన్ని ప్రసాదించేవాడు
ॐ స్తువః నామ సహస్రేణ పురుషః సతతోత్థితః – ఎవరి సహస్రనామాలను స్తుతంచడం చేత మనుష్యులు మంచి స్తితిని పొందుతారో ………….
అంటూ మొదలుపెట్టి “విశ్వం విష్ణుః వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః……” అంటూ ఈ లోకానికి పరమపవిత్రమైన శ్రీ విష్ణు సహస్రనామాలను (1000 నామాలను) ఈ లోకానికి అందించారు భీష్మాచార్యుల వారు.
ॐ అటువంటి గొప్ప భక్తుడు, ధార్మిక వేత్త, యోధుడైన భీష్మాచార్యులవారు మాఘశుద్ధ అష్టమి రోజున నిర్యాణం చెందారు. ఆయనకు గౌరవార్ధం మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా ఈ లోకం జరపాలని మన శ్రీ కృష్ణ పరమాత్మ ఆదేశించారు.
ॐ ఈ రోజు తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించండి. విష్ణు సహస్ర నామాలను పఠించలేని వారు
“శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||”
ఈ పైశ్లోకం చదివితే విష్ణు సహస్ర నామాలు చదివినదానితో సమానం!! ఇది పార్వతీ దేవికి పరమ శివుడు వివరించాడు!!
Sunday, August 14, 2022
అష్టాదశపురాణాల్లో
వ్యాసమహర్షి రచించిన అష్టాదశపురాణాల్లో.. ఏ పురాణంలో ఏముందంటే..
మత్స్యపురాణంమత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు లాంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏంటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేంటో విష్ణుమూర్తి వివరిస్తాడు.
కూర్మపురాణం
కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.
వామన పురాణం
పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతం, రుతువుల గురించిన వర్ణన ఉంటుంది.
వరాహపురాణం
వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.
2022 మరింత అరాచకం.. నోస్ట్రడామస్ భవిష్యవాణి, గతంలోనూ చెప్పిందే జరిగింది..
గరుడ పురాణం
గరుడుడి వివిధ సందేహాలపై విష్ణుమూర్తి చెప్పిన వివరణ గరుడ పురాణం. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతో పాటు జనన మరణాలంటే ఏంటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు, ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది లాంటి విషయాలు ఉంటాయి.
వాయుపురాణం
వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు ఉంటాయి.
అగ్నిపురాణం
అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.
స్కాందపురాణం
కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించి ఇందులో ఉంటుంది.
కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
లింగపురాణం
లింగరూప శివుడి ఉపదేశాలు, శివుడి మహిమలతో పాటూ ఖగోళ, జ్యోతిష్యం గురించి ఉంటుంది.
నారద పురాణం
బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించి ఉంటుంది.
పద్మపురాణం
ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.
విష్ణుపురాణం
పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్ర ఉంటుంది.
ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
మార్కండేయ పురాణం
శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.
బ్రహ్మపురాణం
బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి ప్రస్తావించారు వ్యాసమహర్షి.
భాగవత పురాణం
విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిత్ మహారాజుకి శకమహర్షి చెప్పాడు. శుకుడికి మొదట వ్యాసుడు బోధించాడు.
బ్రహ్మాండ పురాణం
బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించి ఉంటుంది.
భవిష్య పురాణం
సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతో పాటు, భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాల గురించి వివరణ ఉంటుంది.
బ్రహ్మాపవైవర్తపురాణం
ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, రోగనివృత్తిసాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి
ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.
Saturday, August 13, 2022
MY NOTES...
Tuesday, May 17, 2022
నారద మహా ముని జయంతి
ఈ రోజు నారద మహా ముని జయంతి అని గుర్తు చేసినందుకు ధన్యవాదములు అందరికీ తెలిసినదే..కానీ తక్కువ మందికి ఆ మహా ముని గురించి తెలుసుకుంటారు..
మనకి శ్రీ మద ఆంధ్ర మహా భారతం లోను మరియు భాగవతం లో నారదోపాఖ్యానం ఉంటుంది..
మన దౌర్భాగ్యం ఏమిటంటే మన సినిమాలలో నారదులు వారి ని ఒక కలహ ప్రియుడు గా అభివర్ణించారు
మా పూజ్య గురువు గారు శ్రీ మద్ భాగవతం లో నారదులు వారి చరిత్ర అయన గురించి ఎంతగానో వర్ణించారు..
నారదుడు కలహప్రియుడా? నారద మహర్షి మనందరికీ సుపరిచితుడు. అన్ని పురాణాల్లోనూ, కథల్లోనూ మనకు కనిపిస్తాడు. అంతేకాదు దేవ సంగీతకారుడు. నిరంతరం లోక సంచారం చేస్తూ ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలిపేవాడు. ఇంకా చెప్పాలంటే ఆయనో ఆదర్శ పాత్రికేయుడు. నిరంతరం ధర్మరక్షణ కోసం తపించే హరిభక్తుడు మంచికి చెడులకు జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మపక్షమే.
నారద మహర్షి ఎంతో మంది సాత్విటీలకు ఆయన మోక్షమార్గాన్ని చూపించారు. ధర్మానికి, ఆధర్మానికి మధ్య జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్ర పోషించేవాడు. అయితే కొంతమంది. మేధావులు, రచయితలు మాత్రం ఆయన్ను కలహభోజనుడు'గా, 'కలహప్రియుడు"గా అభివర్ణించారు.
ఈ లోకం తీరే అంత... నిజం మాట్లాడేవారికి ఎప్పుడు కష్టాలే అందుకే అన్నారేమో యదార్థవాది లోకవిరోధి. ఈ లోకంలోను, పురాణ కథల్లోను ధర్మ పరాయణులకు ఎప్పుడు కష్టాల్లో ఈ ఆధునిక కాలంలో కూడా సత్యాన్ని, ధర్మాన్ని పాటించేవారంటే అదో చిన్న చూపు వారిని లోకవిరోధులుగానే భావిస్తారు. అనేక కష్టాలకు గురిచేస్తారు. నారద మహర్షి కూడా లోక కళ్యాణం కోసం నిరంతరం తపించేవాడు. ముల్లోకాలలోనూ సంచరిస్తూ దేవ, దానవ, మానవులకు సందర్భానుసారంగా ఆయన కర్తవ్యబోధ చేసేవాడు. అయితే కొంతమంది రచయితలు మాత్రం ఒకరికి ఇంకొకరికి మధ్య కలహాన్ని సృష్టించే వ్యక్తిగా ప్రచారం చేశారు. నారదుడిది ఒక ఉద్దేశ్యం ధర్మ ప్రతిష్టాపన.
"నార” అనగా మానవజాతికి ఉపయోగపడే జ్ఞానం అని, ద అనగా ఇచ్చేవాడనే అర్థం ఉంది. కర అభివృద్ధిని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి, వారిని సన్మార్గంలో దుడు. అంతేకాదు నారథుడు ఒక అత్యున్నత సంగీతకారుడు. భగవంతుడైన b. ఆయనకు ఎంతో ఇష్టం తంత్రీవాద్యం, 'వీణ'ను కూడా కనిపెట్టింది. అయన వీణ పేరు మహతి
వేదాలు, ఉపనిషత్తులలో కూడా నారదుని ప్రస్తావనలు మనకు కనిపిస్తాయి. ఖగోళ, సంగీత శాస్త్రాలలో సైతం ఆయన నిష్ణాతుడు. నారదుని నారద శిక్ష అనే గ్రంథం వ్యాకరణ సిద్ధాంతా వివరిస్తుంది. నారద పురాణం, పంచరాత్రులు మొదలైన కూడా నారదునికి సంబంధించినవే అలాగే నారద భక్తి సూత్రాలు అనే ఒక గొప్ప గ్రంథాన్ని ఆయన రచించాడు. ఇందులో భక్తి మార్గము దాని విశిష్టత, దానిని అనుసరించడం ఎలా అన్న విషయాలపై 84 అధ్యాయాలలో వివరించాడు. ఈ విధంగా మానవాళి శ్రేయస్సుకై నారద మహర్షి తనదైన పాత్రను పోషించాడు
ఆయన వచ్చాడంటేనే తగవు... అది సత్యాకృష్ణుల మధ్యే కానీ..
బలరామకృష్ణులే అవనీ.. కృష్ణార్జునులే అయినా..
నిప్పు రాజేస్తే సెగ మొదలే.. అయితే ప్రతి రణం వెనక
కలహభోజుడు.. ఇదీ బిరుదు
నారదుడు వచ్చి వెళ్ళాక
గొడవ జరక్కపోవడం అరుదు..
ఇక్కడి కబుర్లు అక్కడ.. అక్కడి మాటలు ఇక్కడ..
ఏదైనా మంచికే.. చివరకు దుర్మార్గం కథ కంచికే..!
చేతిలో మహతి.. శ్రీహరి శరణాగతి..
నిరంతర నారాయణ నామపారాయణ..మెడలో మాల..
తలకు ముడి..కాళ్లకు పావుకోళ్లు..
కాషాయ వస్త్రాలు..బుర్ర నిండా శాస్త్రాలు...
మాటల అస్త్రాలు.. చూపుల శస్త్రాలు..
విష్ణువుకు ఇష్టుడు..బ్రహ్మకు బేటా..
ఇదీ నారదుడి బయోడేటా..ఇవన్నీ ఇంకెవరికీ రావే..
ఆయన మాత్రం అచ్చం కాంతారావే..!(మన సినిమాలలో )
ఈ నారదుడే వ్యాసుడి చేత రాయించినాడు భారతం..
వాల్మీకికి ప్రబోధించినాడు
నారదుని పాత్ర లేనిదే రక్తి కట్టదు ఏ పురాణం..
హిట్టు కొట్టదు పౌరాణిక చిత్రం..
రావణుడి కోపానికి..సత్యభామ విలాపానికి..
కిట్టయ్య సల్లాపానికి..నరనారాయణ రణానికి..
రామాంజనేయ యుద్ధానికి కృష్ణాంజనేయ సమరానికి..
మంచోళ్లు ఏ ఇద్దరి మధ్య యుద్ధం జరిగినా
అక్కడ ఆనందంగా నారదయ్య సిద్ధమే..
పేరుకే తంపులు.. చెడుకే తలవంపులు..!
ఓ లోకోత్తర కారణం..
తంటా వెంట ఒక పంట..
కయ్యం సద్దుమణిగినాక కళ్యాణం..అదే నారద పురాణం..!
Monday, September 13, 2021
భాద్రపదమాసం శుద్ధ అష్టమి రాధాష్టమి