Sunday, August 8, 2021

ప్రకాశం ఫామిలీ


కీర్తి శేషులు శ్రీ.  రాణీ ప్రకాశ శర్మ గారు  గురించి కొన్ని మంచి మాటలు 

ర్యాలీ గ్రామ వాస్తవ్యులు , హరితస గోత్రికులు , రాణీ వారి వంశస్తులు  , సూర్య పుత్రులు (తండ్రి గారు సూర్య నారాయణ ), నిత్య ఆదిత్య హృదయ పఠనం  / సుందర కాండ పారాయణులు , పరమ భాగవతోత్తములు అయిన మా తండ్రి గారు  సూర్య ప్రకాశములు  

కఠినత,నియమము,నిష్టయు, తో అఖుంటిత దీక్ష తో,

హఠమున ముద్రలు సలుపగ అంగుళి తోడన్

చేతిన నొసటస అడ్డ విభూతి పట్టె

చెలగె సంప్రదాయ శిఖయె శిరమునందు ధరించే,

రక్షణ కై గాయత్రి , సుందరాకాండ పారాయణ   చేయు మా తండ్రి గారికి  గారికి ముందుగా పాదాభివందనం

మా నాన్నగారు  భాషా ప్రవీణులు తో పాటు డిగ్రీ ని కూడా పూర్తి చేసి , అనేక ప్రైవేట్ కంపెనీ లో పని చేసి చివరిగా ప్రభుత్వ  ఉద్యోగం లో స్థిరపడి  రిటైర్మెంట్ జీవితం ను కూడా ఒక ప్రణాళిక గా తయారుచేసుకున్న వ్యక్తి  , 

తండ్రి గారు శ్రీ రాణీ సూర్య నారాయణ గారు ర్యాలీ జిల్లా పరిషత్ పాఠశాల లో  ఉపాధ్యాయులు  గా పనిచేసి, ఎందరెందరి కో మంచి విద్యని అందించి , మంచి రంగాలలో నిపుణులు అయ్యే విధం గా తయారు చేసిన విద్యా దానం చేసేన మహానుభావులు.. ఆయనది చాల మెత్తని స్వభావం. దయార్ద్ర హృదయులు. వారి సంతానం అందరు ప్రభుత్వ రంగం లో పనిచేసి చివరికి రిటైర్మెంట్ లోను , చివరి దశ   వరకు కూడా ఎవరిమీద ఆధార పడకూడదు అనే సంకల్పం తో వారిని ఆశీర్వదించిన మహా వ్యక్తి.  పాఠశాలలో తెలుగు అధ్యాపకుని గా  పనిజేసి రిటైర్మెంట్ ని అదే  కల ను సార్ధకం చేసుకోలేకపోయారు.   

ఇక మా నాన్నగారు అయిన రాణీ వెంకట సూర్య ప్రకాశం శర్మ గారు  పరమ శివ భక్తులు. తానూ నమ్ముకున్న సూర్య భగవానుడు ని ప్రతి నిత్యమూ ఆదిత్య హృదయం పారాయణ తో ప్రార్ధించే వారు.. , అలాగే సుందరా కాండ పఠనం ఎప్పుడు చేస్తూనే ఉండేవారు .. ఏ కష్టం , సుఖం వచ్చిన ఆ  స్వామి హనుమతో చెప్పుకునే వారు , సుందరా కాండ పారాయణ రూపం లో స్వామి కి తన విన్నపం ను తెలియచేసే వారు..  మా నాన్నగారు ఎప్పడు సుందరా కాండ పారాయణ చేసిన ఆ స్వామి వారు మా ఇంటికి కోతి రూపం లో వచ్చే వారు ..  స్వామి  ఉన్నారు అనే నమ్మకం అయన ని ముందుకు నడిపించేది 

మా నాన్నగారు  మహర్షిలా జీవితాన్ని గడిపే వారు .. చివరికి మౌన ముని లా తనలో తానె రమిస్తూ ఒక రమణ మహర్షి లా మా అందరికీ కనిపించే వారు. 

చిన్న వయస్సు లోనే సంస్కృతాంధ్రాలను  తన తండ్రి గారు వద్ద నేర్చుకున్న వ్యక్తులు మా నాన్నగారు , వారి అన్నదమ్ములు . వాళ్ళు ఆరుగురులు   


మా నాన్న గారి చెంత కూర్చున్న చాలును

మాకు పట్టువడెడి వరము దొరకు!

వారు కరుణ తోడ నేరుపు మంత్రము

భావి తరాల పదిల పరచు బాట యగును! 

కానీ ఇక మాకా అదృష్టం  కరువయ్యెను  

 

ఆలా మా నాన్నగారు / మా నాన్నమ్మ మా  చిన్నతం నుంచి మా అందరికీ బోలెడు కధలు మంచి విషయాలు నేర్పించారు . 

చెప్పువారు లేక చింతింతు రెందరో

చెప్ప గలను నేను చేర రండు

అనెడి మా నాన్నమ్మ  గారి కాయుష్షనంతమై

రాణీ వారి వంశం వృధ్ది చెందు గాత! 


ఆలా మా నాన్నగారు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే ఉంటుంది.. ఎందుకంటే జీవితం ను కాచి వడపోసిన  మహా మనిషి.


మనకి లాక్ డౌన్ లో కొంత ఇబ్బంది అయినా ఆ సమయాన్ని నేను కొంత సద్వినియోగ పరిచినను 

లాక్ డౌన్ మొదలు అయినా దగ్గర నుంచి నిత్యం భాగవతం, ఈశ్వర సేవ, అలాగే మా తండ్రి గారు తో చాల సమయం గడపడం , పుస్తకాలూ చదవడం మొ.. చేసాము 

అప్పుడు తెలిసింది మనం గడిపిన కాలం, కొన్న పుస్తకాలూ, అసలు ఏమి జరిగింది ఇన్ని సం.. అని రీలు తెప్పను. 

ఎన్నో ఫ్లాష్ బ్యాక్ లు, రింగులు రింగులు తిరిగాయి.. ఇక పుస్తకాలూ అలమారు దగ్గరకి వెళ్ళాను మా నాన్నగారు చదివిన పుస్తకాలూ , కొన్న పుస్తకాలూ చూసాను , అది ఒక గ్యాన నిధి, భాండాగారం అనిపించింది , మా నాన్నగారు అంటే  అనుభవాల గనులు, స్వాతంత్య్రానికి పూర్వమే పుట్టిన మనిషి కదా.. ఎంత కష్టపడి తే కానీ ఈ స్థాయి లో ఉన్నారు.. ఇప్పుడంటే మా నాన్నగారు వృధాప్యం లో ఉన్నారు , 

ఒక్క నాడు తలకి రంగు వెయ్యని వారు జుట్టు తెల్లబడిన  కేశాలవాడు మా నాన్నగారు ,  అంతర్గతంగా తలపండిన పండితుడు అని అయన చదివిన పుస్తకాలు చుస్తే తెలిసింది . మా నాన్న గారు బాహ్యంగానే గాదు అంతరంగా కూడా తల పండిన వృద్ధుడే.

మా నాన్నగారు ఫోటోస్ అన్ని ఒకచోట పొందుపరచి ఆల్బం చేసి చూస్తుంటే తెలిసింది అయన  ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడు అయ్యారు అని. వృధాప్యం లో ఉన్న తల్లిదండ్రులు ని ఎవరిని పలకరించినా  చాలు పాలకడలిలా పొంగులు వారే పసివాళ్ళు  అవుతారు, ఎందుకంటే వాళ్ళ గత సృతులు ని గుర్తు చేస్తాయి కాబట్టి.. 

చివరిగా మనం లాక్ డౌన్ పేరు తో కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటె ఏమి చెయ్యాలో ఒక్కోసారి తెలియని పరిస్థితి.. బయటకి వెళ్లలేని , తిరగలేని వాళ్ళం అయ్యాము , మా నాన్నగారు ని చూసినప్పుడల్లా అదే అనిపిస్తోంది.. ఎన్ని సం నుంచి లాక్ డౌన్ లో ఉంటున్నారో ...

ఎప్పుడు చుసిన మా నాన్నగారు కళ్ళు మూసుకుని ఆధ్యాత్మికం గా ఎదో నామస్మరణా చేసుకుంటూనే ఉంటారు.. అదే వారికీ శ్రీ రామ రక్ష 

ఇప్పటికే నాన్నగారు ని ఉదయమే నిద్ర లేపాలి సూర్యోదయం కి ఎదురుగా వీల్ చైర్ లో కూర్చుపెడితే ఆ ఆదిత్యుని చూస్తూ ఆదిత్య హృదయం చదువుకుంటూ జపించుకుంటూ ఉంటారు . మా నాన్నగారు కి ఏ కష్టం వచ్చిన , మంగళ కరం జరిగిన ఆ స్వామి వారిని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎల్లప్పుడూ సుందరాకాండ పారాయణ చేసుకుంటారు.. ఎందుకంటే మనమందరం  పచ్చగా ఉండాలని తపించే ఉదాత్తుడు కాబట్టి..   రోజు సాయంత్రం మా నాన్నగారు ని తయారు చేసి మా గవాక్యం లో కూర్చోబెడితే మా ఇంటిని కాచే ఈశ్వరుడు మా నాన్నగారు ,మనసు అర్థం కాని అంతరిక్షం. ఆయన హృదయం తెలుసుకోలేని అనంత సాగరం.

మా నాన్నగారు కి ఈ వయసులో కూడా అలుపెరకుండా , విరామం విశ్రాంతి ని కూడా పక్కన పెట్టి సేవ చేస్తున్న మా తల్లిగారుకు ఇదే మా నమస్సుమాంజలి లోకం లో అమ్మ ఒడి గుడి అయితే నాన్న భుజం లోకాన్ని చూపే బడి , కనిపించే దేవత అమ్మ అయితే నడిపించే దైవం నాన్న!ప్రేమించడం అమ్మ వంతయితే.. దీవించడం నాన్న వంతు. అమ్మ అమృతమైతే.. దాన్ని నింపే కలశం నాన్న.

నాకు ఈశ్వర సేవ ఎంత ముఖ్యమో అంత కన్నా గొప్పది పితృసేవ అని నా అభిప్రాయము. నాన్నగారు కి స్నానం చేయిస్తుంటే రుద్రుడి కి  అభిషేకం చేస్తున్న భావన తో స్నానం సమర్పయామి అన్నట్టు,పౌడర్ ,తిలక ధారణ   విభూది ధారణ చేస్తున్నపుడు స్వామికి అలంకరణ చేస్తున్నట్టుగా భావిస్తున్నాను.స్వామి వారికి చెయ్యాలిసిన ఉపచారాలు అన్ని నాన్నగారికి ప్రత్యక్ష ముగా చేస్తున్న భావనతో చేస్తున్నాను..అంతకంటే ఏమి కావాలి..

అయన జీవితం ఒక "ప్రకాశ" వంతం మాకు ఇచ్చారు ఒక  "సూర్య" వంశం ను  ..   ఆయన పేరులోనే గాదు, జీవితంలో గూడా సూర్య ప్రకాశమే, ఆయన "మానసం" నిండా కృష్ణుడే కనుకనే మా యింట కృష్ణ మానసయై వెలిసింది 

మాకు రాణి యును, వాణి యు, సూర్యయు, శర్మ గా ఈ లోకమునుకు పరిచయ చేసి మమ్మల్ని ఉజ్వలంగా ఉంచడానికి పడ్డారు ఎంతో కష్టం, మాకునొక బ్రద్కును జూపిన మీకు దండముల్.


ఒక రకం గా మా నాన్నగారు వారి చిన్న తనం లో చాల కష్టపడ్డారు.. మా అమ్మ ఈ విషయం ను మాకు చాల సార్లు చెప్పేది.. వినే అవకాశం నాకు లభించింది.. 

పాపం మా అమ్మగారు మా నాన్నగారు చివరి నిమిషం వరకు ఎనలేని సేవ చేసారు..

చిన్న పిల్లలకి ఎలా సేవ చేస్తారో అలాగే చేసి మా నాన్నగారు మంచి గా హాయిగా పడుకుంటే అప్పుడు నేను అమ్మ ఆలా కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం.. 

మా అమ్మగారు వారి చిన్న తనం విశేషాలు , పడ్డ కష్టాలు , మా నాన్నగారు జీవితం గురించి చాల సార్లు చెప్పింది.. మా నాన్నగారు పడ్డ కష్టం మాములు కష్టం కాదు..

మా అమ్మ చాల సార్లు అంటూ ఉంటుంది.. వెర్రి బ్రాహ్మణుడు అని.. నిజమే 

మా నాన్నగారు ని ఒక ఆదర్శం గా తీసుకుంటే జీవితం సాఫీగా వెళుతుంది.. ఎవరిని ఇబ్బంది పెట్టె వారు కాదు 

ఎలా అంటే 

ధర్మానువర్తన మర్మమ్ము లెరిగిన

విమల చరిత్రుడౌ విప్రు డితడు!

భాస్కరానుగ్రహమ్మును బడసె నితడు!

సంస్కృతాంధ్రమ్ము లందున చతురుడితడు!

తండ్రి పదమునకే గొప్ప పరువితండు! 

అన్నట్టు గా మా జీవితానికి ఒక మార్గ దర్శకునిగా నిలిచారు..

సశేషం 

ఇట్లు 

ప్రకాశం ఫామిలీ 


Thursday, July 1, 2021

కుచేలోపాక్యనం

 ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

భాగవతములో శ్రీ కృష్ణుని దర్శనాన్ని అపేక్షించనటువంటి వారు ఎవరు ఉండరు . పరిపూర్నావతారం కృష్ణావతారం ,అటువంటి కృష్ణుని యొక్క పాదములు పట్టుకొన్నవాళ్ళు కృష్ణనుగ్రహాన్ని కోరుకున్నవాల్లే తప్ప కృష్ణుడే వచ్చి ఒక పేద బ్రాహ్మణుడి యొక్క పాదాలు పట్టుకుని ఆ పాదాలు కడిగి ఆయనికి నమస్కరించి ఆ పాదాలు కడిగిన నీళ్ళు తాను తలమీద చల్లుకుని తన పట్టమహిషి రుక్మిణి దేవి యొక్క తల మీద చల్లడం అసాదరమైనటువంటి ఘట్టం. ప్రమాణ వాక్కు అని లోకములో ఒకటి ఉంటుంది అంటే ఏది పట్టుకుంటే తరిస్తామో అటువంటి ప్రమాణాన్ని నిర్ణయం చేస్తారు . వేదాన్ని విభాగము చేసి 18 పురాణములను ,మహాభారతాన్ని ,బ్రహ్మాసూత్రాలని ఇచ్చిన మహాపురుషుడు వేద వ్యాసుడు . అందుకే వేద వ్యాసుడు చెప్పిన మాటలు మాత్రమే చెప్పడానికి ఇష్టపడతారు గురువులందరు ఎందుకంటే అవి అటువంటి పరమ పవిత్రమైనటువంటి గంగా నది వంటివి.వ్యాసుడు చెప్పినదే చెప్తుంటారుఅటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు రచించిన భాగవతాన్ని ఆంధ్రీకరించిన పోతన గారు కుచేలుడు ఎంత గొప్పవాడో చెప్పారు.అటువంటి శ్రీ మద ఆంధ్ర భాగవతం ను మనకి 16 నెలలనుంచి నిర్విఘ్నం గా, నిరాటంకం గా ,  గంగా ప్రవాహం లా మనకి మన శివ పరివారం కు అందించిన మహా పురుషులు మన పూజ్య గురువు గారు.. ఒక్కోసారి అనిపిస్తుంది ఆ పోతనగారి మన గురువు గారు రూపం లో వచ్చి మనకి ఈ భాగవతం ను తెలియచేస్తున్నారు అనిపించింది .అంత శివ సంకల్పం 

గురువు గారు చెప్పిన ప్రవచనం లో ఈ ఘట్టం చాల బాగుంది..గురువు గారు చెబుతున్నారా సేపు కుచేలుడు ఎలా ఉన్నారో , శ్రీ కృష్ణుడు ఆయనకి ఎదురు వెళ్లి స్వాగతం పలుకుతారో అంత కళ్ళకి కట్టినట్టుగా మాకు చెప్పారు 

కుచేలుడు . అసలు అయన పేరేమిటి షుబాముడు అని ప్రతీతి . 

చేలము అంటే బట్ట కుచేలము అంటే చిరిగిపోయినటువంటి బట్ట ,చిరిగిపోయిన బట్ట కట్టకూడదు ,వేదములో నియమము ఉంది ,కాలిన బట్ట గాని ,చిరిగిపోయిన బట్ట గాని కట్టుకుని ఉండకూడదు అలక్షణం ,మరి కుచేలుడు ఎందుకు కట్టుకుంటాడు అది ఆయన చిరిగిపోయిన బట్ట అన్న విషయము ఆయనకి జ్ఞాపకము ఉండదు అసలు ఆయన బట్ట చూస్తాడు అబ్బా పీతాంబరము అని కట్టుకుంటాడు ,ఇది చిరిగిపోయింది రా అన్న భావన ఆయనికి ఉండదు .

కుచేలుడు గొప్ప బ్రాహ్మణుడు, సిగ్గు విడిచిపెట్టి అందరి దగ్గరికి వెళ్లి చెయ్యిచాపి నాకు సహాయం చెయ్యండి అని ఆయన జీవితములో లేదు ,ఆయనకి రాగ ద్వేషాలు లేవు ధర్మమే ఆయన ,ఆయనే ధర్మం . ఎప్పుడు పరబ్రహ్మ్మములో రమిస్తూ ఆనందపడిపోతాడు . అటువంటి బ్రహ్మవేత్త ,బ్రహ్మజ్ఞాని కుచేలుడు . బ్రహ్మ వేత్తలని అర్దము చేసుకోవడం అంత తేలిక కాదు

ఒక బ్రాహ్మణుని కి ఉండవలిసిన మొట్ట మొదటి లక్షణం ,పరమ సంతోషముతో ఉండాలి

కుచేలుడు అంటే శరీర బ్రాంతి లేనివాడు . కుచేలుడి భార్య ఆవిడ అంతకన్నా గొప్ప ఇల్లాలు ,ఆవిడ చెప్పిన మాట భాగవతం లో అమృత బాండం . భగవంతుడు అంటే ఎంత కారుణ్య మూర్తి అండి ,అసలు ఎప్పుడు తలచుకోనివాడు కూడా కష్టం వచ్చినపుడు తలచుకుంటే రక్షిస్తాడే ,పిల్లలికి అన్నం లేదు ఒక సారి మీ స్నేహితున్ని అడగండి , వెళతాను గాని స్నేహితుని దగ్గరకు వెళ్ళేటపుడు ఎమన్నా పట్టికేల్లాలి ఎమన్నా ఉందా అన్నాడు ,అప్పుడు అడిగాడు ఎమన్నా ఉందా ఇంట్లో అని ,అప్పటి వరకు నే తినాలి ఎమన్నా ఉందా అని ఆయన జీవితములో అడగలేదు ,అటుకులు మూట కట్టింది ఆ ఉత్తరీయానికి ,పిచ్చి బ్రాహ్మణుడు ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళాడు ద్వారకా నగరానికి ఎందుకు కృష్ణ దర్శనం అవుతుంది అది ఆయన సంతోషం ,తీరా ద్వారకా నగరానికి వెళ్ళాక గుర్తు వచ్చింది ,నేను ఇలా ఉన్నాను కదా ,నన్ను పంపిస్తార కృష్ణునికి స్నేహితున్ని అంటే నమ్ముతార అని ,ఎలాగోలా వెళ్తున్నాడు , ఉత్తరీయం లేదు ఆయనికి ఓ ముక్క వేసుకున్నాడు ఎందుకని ,ఉత్తరీయం లేకుండా ఉండకూడదు కాబట్టి ,పెద్దలు దగ్గరికి వెళ్ళేటపుడు ఎడం బుజం మీద ఉత్తరీయం లేకుండా ఉండకూడదు ,అందుకేసుకున్నాడు ఓ గుడ్డముక్క దానికి అటుకుల మూట కట్టుకున్నాడు. ఏమి తిన్నాడు ,ఎప్పుడు తిన్నాడు ,ఏమి తాగాడు ,శరీరానికి బడలిక ఉండదా ?సంతోషంలో మరిచిపోయడాయన ,ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ నవ్వుతున్నారు ,, ఉరఃపంజరం అంత కనపడుతుంది ,ఎముకలన్నీ కనపడుతున్నాయి ,దవడలన్ని పోడుచుకోచ్చేసాయి.

కుచేలుడు  వస్తుంటే కృష్ణుడు, రుక్మిణి దేవితో కలిసి స్వాగతం చెప్పి ,తాను రుక్మిణి దేవితో కలిసి శయనించేటటువంటి ,కూర్చునేటటువంటి హంసతూలికా తల్పం మీద కూర్చోబెట్టారు ,చూసి చెలికత్తెలు అన్నారు , , మేము ఋషులు దర్శనం చేస్తే చూసాం కృష్ణున్ని ,మహర్షులు ,మునులు ఈయనతో సరిపోతారా ,అరెరె కృష్ణుడు ఎదురు వచ్చి తీసుకెళ్లాడయ ,రుక్మిణి దేవితో కలిసి కూర్చునే తల్పం మీద కూర్చోబెట్టాడు. ,ఎవరికి చేసాడు భాగవతం లో ఇలా ,కూర్చోపెట్టి సాక్షాత్తు ఆది లక్ష్మీ ,ఆవిడ తీగంటి చూపు పడితే చాలు మహాదైస్వర్యం అందుతుంది ,ఆవిడ విష్ణు పాదములు కడగడం కాదు ,కుచేలుడు పాదాలు కృష్ణుడు కడుగుతుంటే నీళ్ళు పోసింది ,ఆవిడ పోస్తుంటే కృష్ణుడు కింద కూర్చుని కడిగాడు ఆయన పాదాలు ,ఏదో అలవోకగా కడగలె స్నేహితుడు అని ,పరమ భక్తితో కడిగాడు ,ఎందుకో తెలుసా నీవంటి బ్రహ్మవేత్త లేడు ,ఆయన కాళ్ళు కడిగి తలమీద జల్లుకున్నాడు ,రుక్మిణి దేవికి జల్లాడు ,అంతఃపుర పరివారానికి జల్లాడు ,చందనం తీసి పట్టుకొచ్చి , ఆయన వొళ్ళంతా చందనం రాసాడు ,ఎంత అలసిపోయవో ,నీకు తెలియదు ,నీకు భార్య ,బిడ్డలు ,భూములు ,ధనం ఏమి అవసరం లేదు,ఎప్పడు సంతోషం లో ఉంటావు ,కుచేల ఎక్కడుంటాడు నీలాంటి వాడు అని ,ఆయన శ్రమ పోయేటట్టు తనే విసిరి కర్ర పట్టుకుని ,తాటాకు విసినికర్రతో విసిరాడు ,ఆయనికి దూపం తీసుకుని వచ్చి చూపించాడు ,సువాసన పీల్చవోయి ,దీపాలతో హారతులు ఇచ్చాడు ,ఎవరు ఎవరికీ పరిపూర్నావతారం అయిన కృష్ణ భగవానుడు ,అంతటి బ్రహ్మ వేత్త అయినటువంటి కుచేలుడికి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నాడు అంటే మీరొకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి ,ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత పరమేశ్వరుడు కూడా పరవశం అయిపోతాడో ,,శ్రీ కృష్ణడు   స్నేహితుడు కుచేలుడికి ఒక నమస్కారం అన్నారు అనుకోండి పొంగిపోతాడు 

కుచేలుడి గొప్పతనం ఎక్కడుంది అంటే ఆయన తీసుకువచ్చిన అటుకులు పెట్టడానికి సిగ్గుపడ్డాడు ,ఇద్దరు కలిసి చదువుకున్నారు కదూ ,ఏవోయ్ నీకు మన గురువు గారు గుర్తు ఉన్నారా శందీపని మహర్షి అని గురువు గారిని పొగిడాడు ,స్నేహితుడివి నాకేదో తేకుండా ఉండవు ,ఏదో తెచ్చావ్ అని వొళ్ళంతా తడిమేసి ఆ ఉత్తరీయానికి కట్టుకున్న అటుకులు ,గట్టిగా లాగితే చిరిగి పోతుంది బట్ట అవి తీసుకుని గుటుక్కున నోటిలో పోసుకుని పర పర పర నమిలి మింగుతున్నాడు ,ఎవరు లక్ష్మీనాధుడు ,ఇంకొక పిడికిడి తీసాడు ,భాగవతం మొత్తం మీద ఇలా లేదు ,రుక్మిణి దేవి ఆదిలక్ష్మి వచ్చి కృష్ణుని చేయి పట్టుకుంది ఎందుకని ,,లక్ష్మీ దేవి పట్టేసుకుంది చేయి ఇంక తినొద్దు అని ,ఇలా అన్నాడు కృష్ణుడు ఏ ,ఒక్క పిడికిడి తింటే మీరేమిచ్చేసారో నాకు తెలుసు ,ఇంకొక్క పిడికిడి తింటే ఆ భక్తుడికి నన్ను ,నిన్ను కలిపిచ్చేస్తారు

కుచేలోపాక్యనం మీరు చదవండి ,కుచేలోపాక్యనానికి చిట్ట చివర ఒక మాట చెప్తారు ,అన్ని అంతఃపురాలలో ఉన్న కుచేలుడికి ఐశ్వర్య భావం లేదు ,ఎప్పడు బ్రహ్మ్మముతో రమించి ,బ్రహ్మ్మము నందు ఐక్యం అయిపోయాడు ,కుచేలోపాక్యనం ఒక్క దానికే పల శృతి కూడా చెప్తారు ,గజేంద్ర మోక్షానం వాటికి చెప్పినట్టు ,కుచేలోపాక్యనానికి పల శృతి ఉంది. అది చదివితే ,అది వింటే భగవంతుని యొక్క విశేషనమైనటువంటి అనుగ్రహం చేత దీర్గాయువు ,కీర్తి ,సంపద కలుగుతాయి ,అంత గొప్పది కుచేలోపాక్యనం.

అటువంటి కుచేలోపాక్యనాన్ని ఇంట్లో పెద్దవాళ్లందరూ కూడా పిల్లలకి చెప్పాలి ,అందరు పోతనగారి భాగవతము లోనుంచి చదువుకోవాలి. కుచేలోపాక్యనం భాగవతం దశమ స్కందం ఉత్తర భాగం లో ఉంది ,ఉత్తర భాగములో ఉన్నటువంటి కుచేలోపాక్యనాన్ని చదువుకోవాలి ,ప్రతిరోజూ కుచేలోపాక్యనాన్ని చదువుకుని కుచేలుడి యొక్క గొప్పతనానికి పరవసించిపోతే అదే భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. అని గురువు గారు తెలియచేసారు..

ఇట్లు 

శివ పరివారం 

Friday, June 18, 2021

బలరాముడు తీర్ధ యాత్ర

 ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

గంగా ప్రవాహం లా నిత్యం జరిగే మా శ్రీ మద్ భాగవతం ఇప్పుడు దశమ స్కంధం లో ఉత్తర భాగం లో బలరాముడు తీర్ధ యాత్ర లోకి వచ్చాము.

సాధారణం గా మనం పుణ్యకేత్రం కి వెళ్ళినప్పుడు చెయ్యవలసిన పనులు లో ముఖ్యం గా 

దానము , జపము, తర్పణం స్నానం లాంటివి ముఖ్యమైనవి అది చేస్తేనే అది తీర్ధ యాత్ర అవుతుంది.. లేకపోతె అది విహార యాత్ర అవుతుంది..

బలరామావతారము అంటే మహావిష్ణువు ఎత్తిన దశ అవతారాలలో ఇది ఒకటి.  శ్రీమహావిష్ణువు యొక్క శ్వేతతేజస్సు బలరాముడుగానూ, నీలతేజస్సు శ్రీకృష్ణుడిగానూ అవతరించి దుష్టశిక్షణ కోసం తమ అవతార కాలాన్నంతా సద్వినియోగం చేసినట్లుగా అనిపిస్తుంది.  బలరాములు వారు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులుగా జన్మించిన అంశావతారము. వీరి ఆయుధము హలము , నాగలి. వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడు గా ఉన్నవారు.

ఒకసారి కోపం వచ్చి యమునా నది దిశ మార్చినారు,  వీరు కురుక్షేత్ర యుద్దమప్పుడు శాంతి కాముకులై తీర్థ యాత్రలు చేసినారు. శ్రీకాకుళం జిల్లా నాగావళి నది ఆవిర్భావానికి … నాగావళి నదీతీరాన పంచలింగాల ప్రతిష్టకి ఈయనే కారణము

భారత భాగవతాలలో శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రస్తావన వచ్చిన కొన్ని కొన్ని సందర్భాలలో బలరాముడిని గురించి కూడా కొన్ని వివరణలు, కథలు కనిపిస్తాయి. బలరాముడు భగవానుడి దశావతారాలలో ఒక అవతారంగా కూడా ఉన్నాడు.. దేవకీదేవికి సప్తమగర్భం కలిగింది. అప్పుడు దేవకిని, వసుదేవుడిని కంసుడు చెరసాలలో బంధించాడు. ఆ సమయంలో యముడు తన యామ్యమైన మాయతో దేవకీదేవి నుంచి గర్భాన్ని ఆకర్షించి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. బలరాముడికి ఈ సందర్భంలోనే సంకర్షణుడు అనే పేరు వచ్చింది. సంస్కృత మర్యాద ప్రకారం సమ్యక్‌ కర్షణాత్‌ అంటే సంపూర్తిగా ఆకర్షించడం వల్ల ఆయన సంకర్షణుడు అనే పేరుతో కూడా మనకు కనిపిస్తాడు.

బలవంతులందరిలోనూ శ్రేష్టుడు కనుక బలదేవుడు అన్నారు. రామశబ్దానికి సుందరం అనే అర్ధం ఉంది కనుక ఆయన బలరాముడయ్యాడు. శ్రీకృష్ణుడికి అన్న అయిన బలరాముడు ఆదిశేషుడి అవతారం కూడా. సాందీపుడు అనే గురువు దగ్గర బలరామకృష్ణులిద్దరూ విద్యాభ్యాసం చేశారు. ఈ బలరాముడు శ్రీకృష్ణుడిలాగే పాండవులంటే కొంత ఆదరాభిమానాలు కలిగివున్నా ఈయనకు కౌరవులలో దుర్యోధనుడంటే కూడా బాగా ఇష్టం అని కొన్ని కొన్ని భారత కథాఘట్టాల వల్ల తెలుస్తుంది. ఈయన భార్య పేరు రేవతీదేవి. నాగలి, రోకలి, బలరాముడి ప్రధాన ఆయుధాలు. బలరాముడు ఎప్పుడూ నీలరంగు వస్త్రాలనే ధరిస్తుంటాడు. ఈయన జండామీద తాటిచెట్టు గుర్తు ఉంటుంది.

బలరాముడు గదాయుద్ధ ప్రావీణ్యుడు

గధాయుద్ధంలో   బలరాముడు గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించాడు. భీముడు, దుర్యోధనుడు ఇద్దరూ ఈయన దగ్గర గదాయుద్ధ విద్యను నేర్చుకున్నారు. విశేషించి దుర్యోధనుడు, పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు భీముడిని జయించాలన్న లక్ష్యంతో ఈయన దగ్గర ఎన్నెన్నో గదాయుద్ధ మెళుకవలను నేర్చుకున్నాడు.

కురుక్షేత్ర సమయంలో తీర్థయాత్రలు చేసిన బలరాముడు,

అలా తీర్ధయాత్రలకు అని బయలుదేరిన బలరాముడు, ప్రభాసతీర్ధానికి వెళ్ళి స్నానం చేసి ప్రీతితో దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు వదిలాడు. బ్రాహ్మణోత్తములు కూడా వస్తుండగా అతడు అక్కడ నుండి బయలుదేరాడు. క్రమముగా సరస్వతి, బిందుసరోవరం, వజ్రతీర్థం, విశాలానది, సరయువు, యమున, గంగ మున్నగు పుణ్యనదుల్లో స్నానాలు చేసి, దేవతలకు, ఋషులకు, పితృగణాలకు తర్పణాలు సమర్పించాడు. బ్రాహ్మణులకు సంతర్పణలు చేసాడు. పిమ్మట బలరాముడు లోకములు సమస్తము నందు స్తుతిపాత్రము, మునీంద్రులకు నివాసస్థానము అయిన నైమిశారణ్యం ప్రవేశించాడు. అప్పుడు అక్కడి మునులు దీర్ఘసత్రయాగం జరుపుతూ ఉన్నారు. వారందరూ బలరాముడికి ఎదురేగి వినయంగా స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశారు. బలరాముడు సంతోషించి సపరివారంగా ఆసీనుడయ్యాడు.

గోమతీం గండకీం స్నాత్వా విపాశాం శోణ ఆప్లుతః | గయాం గత్వా పితౄనిష్ట్వా గంగాసాగరసంగమే ॥ ఉపస్పృశ్య మహేన్ద్రదౌ రామం దృష్ట్వాభివాద్య చ ॥ సప్తగోదావరీం వేణాం పంపాం భీమరథీం తతః ॥ స్కన్దం దృష్ట్వా యయౌ రామః శ్రీశైలం గిరిశాలయం | ద్రవిడేషు మహాపుణ్యం దృష్ట్వాద్రిం వేంకటం ప్రభుం ॥ కామకోష్టీం పురీం కాంచీం కావేరీం చ సరిద్వరాం | శ్రీరంగాఖ్యం మహాపుణ్యం యత్ర సన్నిహితో హరిః IIఋషభాద్రిం హరేః క్షేత్రం దక్షిణాం మథురాం తథా! సాముద్రం సేతుమగమత్మాహాపాతకనాశనం ॥

బలరాముడు గోమతి, గండకి, విపాశ నదులలో స్నానమాడెను రో యందును అతడు క్రుంకులిడెను. గయకు వెడలి ఆతడు పితరులను ఆరాధించెను. గంగాసాగర సంగమ స్థానమున ఆతడు పవిత్రస్నానము కావించెను. మహేంద్ర పర్వతము చెంత అతడు పరశురాముని దర్శించ స్తోత్రము కావించెను. పిదప సప్త గోదావరులలో స్నానమాడి వేణ, పంపు భీమారథి యను నదులలో కూడ అతడు స్నానమాడెను. పిమ్మట బలరాముడు. స్కందుని కలిసికొని గిరీశుని ధామమగు శ్రీశైలమును దర్శించెను. ద్రవిడదేశమని తెలియబడు దక్షిణ ప్రాంతమున అతడు పవిత్ర వేంకటాచలమును, అట్లే కామకోష్టిని, కాంచీపురమును, నదీశ్రేష్ఠమగు కావేరిని, సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అవతరించియున్నట్టి పరమ పవిత్రము శ్రీరంగ క్షేత్రమును దర్శించెను. అచట నుండి అతడు హరిక్షేత్రమగు ఋషభ పర్వతమునకు, దక్షిణ మథురకు వెడలెను. తరువాత అతడు మహాపాతక నాశనమగు సేతుబంధమునకు చేరెను.

నలభైరెండురోజుల తీర్థయాత్ర ముగించుకొని కురుక్షేత్ర సంగ్రామం చిట్టచివరిలో భీముడు, దుర్యోధనుడు గదాయుద్ధం చేసుకునే సమయానికి తిరిగి వచ్చాడు.

మనకి శ్రీ మద్ భాగవతం లో మన ధర్మ ఆచరణములు ఎలా నిర్వర్తి0చాలో తెలియచేసింది 

ఇట్లు 

శివ పరివారం 

Monday, June 14, 2021

దశమ { 10 వ } స్కంధము నందలి కథా క్రమము.

 


దశమ { 10 వ } స్కంధము నందలి కథా క్రమము.
ప్రద్యుమ్న కుమార చరిత్ర ప్రారంభము.
రతీదేవి ప్రద్యుమ్న సహితయై గగన మార్గంబున ద్వారకకు బోవుట.
శ్రీ కృష్ణుండు లోకాపవాడ నివృత్తి కొఱకు స్యమంతక మణిన్ దెచ్చుట.
శతధన్వుడు సత్రాజితుని జంపి మణినపహరించుట.
శ్రీ కృష్ణుండింద్రప్రస్థ పురంబునకరుగుట.
శ్రీ కృష్ణుండు కాళిందీ మిత్రవింద నాగ్నగితి భద్ర లక్షణల బరిణయం బగుట.
శ్రీ కృష్ణుడు సత్యభామతో గూడ నరిగి నరకాసురుని వధించుట.
సత్యభామ నరకాసురునితో యుద్ధంబు సేయుట.
భూదేవి శ్రీ కృష్ణుని స్తుతించుట.
శ్రీ కృష్ణుడు పదాఱు వేల కన్నియల వరించి దేవ లోకమునకు బోయి పారిజాతము తెచ్చుట.
శ్రీ కృష్ణుండు కేళీ గృహమునందు రుక్మిణీ దేవితో విరసోక్తులాడుట.
రుక్మిణీ దేవి శ్రీ కృష్ణ లాలితయై యతని స్తుతించుట.
శ్రీ కృష్ణుండు రుక్మిణీ దేవి నూఱడించుట.
బాణాసురుండీశ్వర ప్రసాదంబు నొందుట.
బాణాసురుండనిరుద్ధుని నాగ పాశ బద్ధుని జేయుట.
నారదుని వలన ననిరుద్ధుని వృత్తాంతమును విని కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుట.
బాణాసురుని సహాయభూతుండగు శివునకు కృష్ణునకు యుద్ధమగుట.
బాణాసురుండు రెండవ సారి యుద్ధమునకు వచ్చుట.
శివుడు బాణుని రక్షింప శ్రీ కృష్ణుని స్తుతించుట.
ఉషానిరుద్ధ సహితుండై కృష్ణుండు ద్వారకాపురంబున కరుగుట.
నృగ మహారాజు చరిత్రము.
బలరాముడు సుహృద్బంధుజన దర్శనార్థమై వ్రేపల్లెకు బోవుట.
శ్రీ కృష్ణుండు పౌండ్రకవాసుదేవుని మీద దండెత్తిపోయి వానిని జంపుట.
బలరాముండు ద్వివిదుడను వానరుని సమ్హరించుట.
బలరాముండు హస్తినా పురమును గంగలో ద్రోయ బూనుట.
షోడశ సహస్ర స్త్రీ సంగతుండైన శ్రీ కృష్ణుని మహిమ నారదుండరయుట.
నారదుండు శ్రీ కృష్ణునితో ధర్మరాజు రాజసూయము నెరవేర్పుమని సెప్పుట.
శ్రీ కృష్ణుండుద్ధవుని యాలోచన చొప్పున ధర్మరాజు పాలికి పోవుట.
పాండవులు శ్రీ కృష్ణుని తోడ్కొని పోవుట.
ధర్మరాజు శ్రీ కృష్ణు ననుమతంబున భీమాదుల దిగ్విజయంబునకు బంపుట.
శ్రీ కృష్ణ భీమార్జునులు జరాసంధుని వధింప బోవుట.
శ్రీ కృష్ణ సహాయుందగు భీముండు జారాసంధునితో యుద్ధము సేయుట.
కారా గృహ విముక్తులగు రాజులు శ్రీ కృష్ణుని స్తుతించుట.
ధర్మరాజు చేసేడి రాజసూయంబు నందు శ్రీ కృష్ణుండు శిశుపాలుని వధించుట.
సాల్వుండు శివ ప్రసాదంబున సౌభక విమానంబు వడసి ద్వారకా పురిపై దండెత్తుట.
శ్రీ కృష్ణుండు దంతవక్త్రుని సమ్హరించుట.
బలరాముండు తీర్థ యాత్రకు జనుట.
కుచేలోపాఖ్యానము.
శ్రీ కృష్ణుండు సకుటుంబముగ గ్రహణ స్నానమునకు బోవుట.
లక్షణ యను శ్రీ కృష్నుని యష్టమ భార్య ద్రౌపదీదేవికి తన వివాహ వృత్తంతము దెలుపుట.
నారదాది మహర్షులు స్రీ కృష్ణ దర్శనంబు సేసికొని వసుదేవునిచే క్రతువు చేయించుట.
శ్రీ కృష్న బలభద్రులు మృతులైన తన సహోదరుల దెచ్చి దేవకీదేవికి కనబఱచుట. సుభద్రా పరిణయము.
స్రీ కృష్ణుండు ఋషి సమేతుండయి మిథిలా నగరమునకు బోవుట.
శ్రుతిగీతలు.
పరీక్షిత్తునకు శుకయోగి విష్ణు సేవా ప్రాశస్త్యము సెప్పుట.
శివ ద్రోహంబు సేయంబూనిన వృకాసురుండు విష్ణు మాయచే మడియుట.
భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్త్యము శోధించుటకు బోవుట.
శ్రీకృష్ణుండు మృతులైన విప్ర సుతులను దెచ్చుట.
దశమ { 10 వ } స్కంధము ఉత్తర భాగము సమాప్తము.

Tuesday, May 18, 2021

చంద్ర వంశం వర్ణనలో - కృష్ణుడు వంశ వృక్షము

ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

ఈ రోజు గురువు గారు ప్రవచనం చాల చాల బాగుంది.. మనకి ప్రతిసారి గురువు గారు చెబుతూ ఉంటారు..మనం శ్రీమద్ భాగవతం లో మహానుభావుల వంశ వృక్షము ను చదివితే మంచిది అని 

శ్రీ కృష్ణ పరమాత్మా వంశ వృక్షము ను తెలియచేసే ప్రయత్నం చేస్తాను..

(1) శ్రీకృష్ణుడు రుక్మిణీల పుత్రుడు ప్రద్యుముడుకి భార్య శుభాంగి రుక్మి కూతురు కాదు, రుక్మి కూతురు "రుక్మవతి". ఈమె ప్రద్యమ్నుడి మరొక భార్య. "ప్రద్యుమ్న రుక్మవతుల" కుమారుడు "అనిరుద్ధుడు".

(2) రుక్మి మరొక కుమార్తె "చారుమతి"ని 'కృతవర్మ కుమారుడు'కి ఇచ్చాడు.

(3) రుక్మి మనువరాలు "రుక్మలోచన"ను ఈ అనిరుద్ధుడు వివాహమాడాడు.

గమనిక:

శ్రీకృష్ణుని సంతతి (కుటుంబసభ్యులు) ఎంతమందో లెక్కించుట సాధ్యం కాదు. వారికి చదువు చెప్పడానికి నియోగించిన ఉపాధ్యాయులే 3,00,88,100 మంది, వీరిలో ప్రజుడు ముసలం బారిని పడకుండా తప్పించుకున్నాడు.

సంక్షిప్తంగా :

శ్రీకృష్ణుని భార్యలు = అష్టమహిషలు + భార్యలు 16,100 = 16108. ఒక్కొక్కరికి పదేసి మంది చొప్పున మొత్తం పుత్రులు 1,61,080.



కృష్ణుని కొడుకులలో ప్రసిద్ధులు:

1 ప్రద్యుమ్నుడు

2 అనిరుద్ధుడు

3 దీప్తిమంతుడు

4 భానుడు

5 సాంబుడు

6 బృహద్భానుడు

7 మధుడు

8 మిత్రవిందుడు|

19 వృకుడు

10 అరుణుడు.

11. పుష్కరుడు

12 దేవబాహుడు

13 శ్రుతదేవుడు

14 సునందుడు.

15 చిత్ర బాహువు

16 వరూధుడు

17 kavi

18 నగదుడు


ఇట్లు 

శివ పరివారం 




Wednesday, May 12, 2021

నవవిధ భక్తి

 మూల సంస్కృత భాగవతంలో నవవిధ భక్తులను ఈ శ్లోకంలో వర్ణించారు

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం,

అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం.

బమ్మెర పోతనామాత్యుల వారు ఈ నవవిధ భక్తులను ఇలా మత్తేభంలో ఎంతో చక్కగా వర్ణించారు.



తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా

ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం

బనునీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స

జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్ సత్యంబు దైత్యోత్తమా!


భావము:

రాక్షసరాజా! భక్తి మార్గాలు తొమ్మిది; అవి సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మనివేదనం, కీర్తనం, చింతనం; ఈ నవ విధ భక్తులు అనే తొమ్మిది భక్తి మార్గాలను మనోవాక్కాయకర్మల (మనస్సు చేత, మాట చేత, క్రియ చేత ఒకే విధంగా నెరవేరుస్తూ, త్రికరణసుద్ధిగా) సర్వాంతర్యామి అయిన శ్రీహరిని నమ్మి ఉత్తముడుగా జీవించుట మానవులకు ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. ఇది కాక మరొక సత్యం నాకు కనబడుట లేదు.

వీటి వివరం చూడండి:-


1 . భగవంతుని లీలలను వినడం . శ్రవణము

2 . ఆయన లీలలను పొగడడం . కీర్తనము

3 . నిరంతరం భగవంతుని నామం తలస్తూ ఉండడం . స్మరణము

4 . స్వామివారి పాదములు ఒత్తుట మున్నగు సేవలు చేయడం . పాదసేవనము

5 . స్వామిని నిత్యం పూజించడం . అర్చించడము

6 . భక్తి తో నమస్కారములు చేయడం . వందనము

7 . దాస భక్తి తొ స్వామికి దాసుడ ననే  భావముతో సేవించడం . దాస్యము

8 . స్వామి నా చెలికాడు అనే భావనతో మెలగుట . సఖ్యము

9 . స్వామీ  నీవే నా సర్వస్వము , ఈ మనో వాక్కాయములు ఉన్నది నీ కొరకే అనే భావన తో  ఆత్మార్పణం చేయడం . ఆత్మ నివేదనము

ఈ తొమ్మిందింటినీ నవవిధ భక్తులు అని అంటారు . ఈ నవవిధ భక్తులలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా మనం స్వామిని పొంది పునరావ్రుత్తి రహిత స్థితి ని పొందవచ్చు. 


ఇక్కడ ఒక్కో భక్తి మార్గం లో తరించిన మహానుభావుల  గూర్చి  మనం తెలుసుకుందాం...


1 . శ్రవణము . పరీక్షిన్మహారాజు . (భాగవతాన్ని (భగవంతుని భక్తుల కధలను) విని తరించాడు )

2 . కీర్తనము . శుక బ్రహ్మ . (భాగవతాన్ని చెప్పి తరించిన మహనీయుడు)

3 . స్మరణము .   ప్రహ్లాదుడు . (ఎప్పుడూ స్వామి నామం చెప్తూ తరించిన మహనీయుడు)

4 . పాదసేవనము . లక్ష్మీదేవి . (అమ్మ గూర్చి ఏమని చెప్పేది, అమ్మ భక్తి తెలియనిదెవరికి )

5 . అర్చనము . పృథు మహారాజు . (ఈయన కధ కూడా భాగవతం లో వస్తుంది)

6 . వందనము . అక్రూరుడు . (భాగవతం లో దశమస్కంధంలో శ్రీ కృష్ణ బలరాములను కంసుని వద్దకు తీసుకు వెళ్ళడానికి వస్తాడు అక్రూరుడు , శ్రీ కృష్ణుని పరమ భక్తుడు ,ఈయన చేసే వందనానికి శ్రీ కృష్ణుడు పొంగిపోయాడంటే ఎంత గొప్పవాడో మనం అర్ధం చేసుకోవాలి)

7 . దాస్యము . ఆంజనేయ స్వామి . (స్వామి హనుమ యొక్క దాస భక్తి, వారు శ్రీ రామచంద్రమూర్తిని సేవించిన తీరు , తెలియని వారు ఉండరు)

8 . సఖ్యం . అర్జునుడు . (శ్రీ కృష్ణార్జునల బంధము లోకవిహితమే కదా)

9 . ఆత్మనివేదనము . బలిచక్రవర్తి . (వామనావతరములో  స్వామికి మూడడుగుల నేల దానమిచ్చి మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అంటే తన శిరస్సుని చూపి స్వామికి తనని తాను సమర్పించుకొని తరించిన మహనీయుడు)


అక్షౌహిణి వివరణ

 


అక్షౌహిణి వివరణ

అక్షౌహిణి – సేనాసమూహవిశేషము

అక్షౌహిణి వరకు సంఖ్యావివరములు


1 రధము + 1 ఏనుగు + 3 గుర్రాలు + 5 కాలిబంట్లు కలిస్తే = ఒక పత్తి

పత్తి x 3 = సేనాముఖము (అంటే 3 రధములు + 3 ఏనుగులు + 9 గుర్రాలు + 15 కాలిబంట్లు)

సేనాముఖము x 3 = గుల్మము (అంటే 9 రధములు + 9 ఏనుగులు + 27 గుర్రాలు + 45 కాలిబంట్లు)

గుల్మము x 3 = గణము (అంటే 27 రధములు + 27 ఏనుగులు + 81 గుర్రాలు + 135 కాలిబంట్లు)

గణము x 3 = వాహిని (అంటే 81 రధములు + 81 ఏనుగులు + 243 గుర్రాలు + 405 కాలిబంట్లు)

వాహిని x3 = పృతన (అంటే 243 రధములు + 243 ఏనుగులు + 729 గుర్రాలు + 1215 కాలిబంట్లు)

పృతన x 3 = చమువు (అంటే 729 రధములు + 729 ఏనుగులు + 2187 గుర్రాలు + 3645 కాలిబంట్లు)

చమువు x 3 = అనీకిని (అంటే 2187 రధములు + 2187 ఏనుగులు + 6561 గుర్రాలు + 10935 కాలిబంట్లు)

అనీకిని x 10 = అక్షౌహిణి (అంటే 21870 రధములు + 21870 ఏనుగులు + 65610 గుర్రాలు + 109350 కాలిబంట్లు)


అక్షౌహిణి కన్నా పెద్దవి - సుగ్రీవుని సైన్యము లెక్క

అక్షౌహిణి కన్నా పెద్దవి - సుగ్రీవుని సైన్యము లెక్క

అక్షౌహిని X 18 = ఏకము

ఏకము X 8 = కోటి ( ఈ కోటి మన కోటి కాదు )

కోటి X 8 = శంఖము

శంఖము X 8 = కుముదము

కుముదము X 8 = X 8 = పద్మము

పద్మము X 8 = నాడి

నాడి X 8 = సముద్రము

సముద్రము X 8 = వెల్లువ

అంటే = 36691,71,39,200 సైన్యాన్ని వెల్లువ అంటారు.


ఇలాంటి 70 వెల్లువలు సుగ్రీవుని దగ్గర ఉన్నట్లుగా కంబ రామాయణం చెపుతుంది.


అంటే 366917139200 X 70 = 2,5684239,97,44,000 మంది వానర వీరులు సుగ్రీవుని దగ్గర వుండేవారు.వీరికి నీలుడు అధిపతి