DATE : 08-03-21
ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ
మనకి నిత్యం జరిగే శ్రీ మద్భాగవతం ఇప్పుడు కాళీయ మర్దనం ఘట్టం లోకి వచ్చేసింది..
శ్రీ కృష్ణుడు లీలలు ఒక్కో ఘట్టం వింటుంటే ఎంతో ఆనందం గా ఉంది..
గురువు గారు ఫోన్ చేసి ఈ రోజు మీ అమ్మాయి కృష్ణ మానస చే స్వామి వారికీ నివేదన ఇప్పిచాలి అనుకున్నాను.. శ్రీ కృష్ణడు కాళీయ మర్దనం నటరాజ దృశ్యం. ఉంది.. అమ్మాయి చే ఒక పాటకి నృత్యం చేయించు అన్నారు..
మా అమ్మాయి అనుకున్న పాట వేరు అప్పటికప్పుడు స్వామి వారి ఆశీస్సులు తో ఇంకో పాట పెట్టాను.. సందర్భానుసారం గా స్వామి వారికీ తన నృత్యం తో శ్రీ కృష్ణుడి లీలల తో నృత్య ప్రదర్శన ఇచ్చింది.. తన సమయస్ఫూర్తి తో చేసినందుకు శ్రీ రామ రక్షా
కాళీయ మర్ధనం యెవరు చేసారో గుర్తుంది కదా?, ఔను కృష్ణుడే చేసాడు! ఎందుకు చేసాడంటే… అసలు కాళీయుడెవరో అతని కథేమిటో తెలుసుకుందామా ..
కాళింది మడుగున వున్న విషసర్పం పేరే కాళీయుడు! కాళీయుడు చిమ్మిన విషం వల్ల నీళ్ళన్నీ విషతుల్యమయ్యాయి. ఆ నీళ్ళు తాగిన వాళ్ళు చనిపోయారు. ఆ నీటిలో వున్న చేపలూ తాబేళ్ళూ వంటి జీవరాసులెన్నో చనిపోయాయి. కాళింది మడుగులోకి దిగాలంటేనే జనం భయపడిపోయారు. కాళింది మడుగునే కాళీయుడున్నాడు. దాక్కున్నాడు!
కాళియ నాగుపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుంది. ఆ పాము చిందించే విషంతో యమునా జలం కలుషితం అయింది. అంతేనా.. ఆ విషపు వేడికి నీలు మరుగుతూ, నదిపై ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తోంది. ఆ వేడి సేగాలకు తట్టుకోలేక పక్షులు, నదిలో పడి చనిపోసాగాయి. ఇది చూసిన బాల కృష్ణుని మనసు ఆర్ద్రమైంది.
కాళీయుడు కాళింది మడుగున దాక్కోవడం వెనుక కథ ఉంది. కద్రువ కడుపున పుట్టిన కాళీయుడు మొదట రమణక ద్వీపంలోనే ఉండేవాడు. అక్కడున్న పాముల్ని చూసి జనం భయపడిపోయారు. వాటికి కావలసిన ఆహారం ఇస్తే తమ జోలికి రావని భావించారు. అందుకే ప్రతిరోజూ ఆహారాన్ని తీసుకొచ్చి చెట్ల మొదళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయేవారు. దాంతో పాములు జనం మీదకి వెళ్ళేవికావు. కాని పాముల్ని చూసి జనం భయపడినట్టే – గరుడుని చూసి పాములూ భయపడేవి. అందుకే తమకి జనం పెట్టిన ఆహారంలో కొంత భాగం తీసి గరుడుడికి ఇచ్చేవి. దాంతో గరుడుడు పాములజోలికి వెళ్ళేవాడు కాదు. అయితే కాళీయుడు గరుడుడికి కేటాయించి పెట్టిన ఆహారాన్ని వదలకుండా తనే తినేవాడు. ఈ సంగతి గరుడుడికి తెలిసింది. కోపం వచ్చింది. కక్ష పెరిగింది. కాళీయుడు కోసం గరుత్మంతుడు వెదికాడు. వెంటాడి వేటాడ బోయాడు. కాళీయుడు భయపడ్డాడు. పారిపోయి వచ్చి కాళింది మడుగున స్థిరపడ్డాడు. *గరుత్మంతునికి తెలిసినా కాళీయుడు ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే గరుత్మంతుడు కాళింది మడుగుకి వచ్చాడా చచ్చాడే*! అలాంటి శాపముంది. ఆ శాపం కాళీయుడికి తెలిసింది. గరుత్మంతుడు తననేమీ చేయలేడని మరింత గర్వపడ్డాడు కాళీయుడు!
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దైవ లక్షణం కదా! యమునా జలాలకు కాలుష్యం నుండి విముక్తి ప్రసాదించాలని, కాళీయుని కోరల్లోంచి వెలువడుతోన్న విషం నుండి పశుపక్ష్యాదులను కాపాడాలని, యమునా జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలో దూకాడు. కాళీయ సర్పం కృష్ణుని చూసింది. తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరు అని ఆశ్చర్యపోయింది. తక్షణం బుద్ధి చెప్పాలని, తన పొడవాటి శరీరంతో కృష్ణుని చుట్టేసింది.ఒడ్డున ఉన్నగోప బాలికలు, యశోదమ్మ అందరూ కంగారుపడ్డారు. భయాందోళనలకు లోనయ్యారు.
కాళింది మడుగు ఉన్నా దాంట్లోకి పెద్దలు దిగనివ్వక పోవడం, జరిగిన నష్టం యెరిగి కృష్ణుడు ఊరుకోలేదు. మడుగు పక్కనే వున్న చెట్టు ఎక్కాడు. ఆ చెట్టుకొమ్మలు మడుగులో తమ నీడ చూసుకుంటుంటే – కొమ్మ మీదుగా వచ్చిన కృష్ణుడు కాళీయుని జాడ చూసుకున్నాడు. మిత్రులు వారించినా వినలేదు. అద్దంలా మెరిసే నీళ్ళలో కాళీయుడు పడగ విప్పి కనిపిస్తూ ఉండడంతో అదే అదనుగా పడగమీదకు దూకాడు కృష్ణుడు. పడగ మీద పాదం మోపి తాండవం చేసాడు. కాళీయుడు కృష్ణుణి భారాన్నీ అవమాన భారాన్నీ మోయలేకపోయాడు. నీటిపైకి శిరస్సు యెత్తి ముంచి యెంతో ప్రయత్నించాడు. కృష్ణుడు కాళీయ మర్దనం అంటే కాళీయుని పడగని పొగరుని నలగ్గొట్టాడు. అతిబల గర్వాన్ని, అహంకారాన్ని అణచేసాడు. శిరసు చితికిపోయేంతగా తొక్కాడు కృష్ణుడు.
దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి, కోపంతో బుసలు కొట్టింది. ఇక కృష్ణుడు కాళీయుని నూరు పడగలపై నృత్యం చేశాడు. శ్రీకృష్ణుడు ఒక్కో పడగమీదికి లంఘిస్తూ కాళియ మర్దనం చేస్తోంటే కాళీయుడు తగ్గిపోయాడు. పడగలు దెబ్బతిన్నాయి. రక్తం ధారలు కట్టింది. కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు. శ్రీకృష్ణుని శరణు వేడాడు. కాళీయుని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి, కాళీయుని క్షమించమని కోరాయి. కృష్ణుడు దయ తలచాడు.. కాళీయుని వెంటనే యమునానది వదిలి వెళ్ళి, రమణక ద్వీపానికి వెళ్ళమన్నాడు. కాళీయుడు కుటుంబ సమేతంగా యమున వదిలి వెళ్లడంతో యమునాజలం పవిత్రమైంది. అందరూ ఆనందించారు
కాళీయుని భార్యలైన నాగకన్యలు వచ్చారు. తమ భర్తని విడిచిపెట్టమని వేడుకున్నారు. కృష్ణుడు చంపకుండా కాళీయుణ్ణి వదిలాడు. గరుత్మంతునితో చావులేకుండా అభయమిచ్చాడు. పాతాళలోకానికి పొమ్మన్నాడు. తిరిగి తాను నివసించిన రమణక ద్వీపానికి కృష్ణుని అనుమతితో భార్యల్ని తీసుకుని కాళీయుడు వెళ్ళిపోయాడు!
కృష్ణుని కాళీయ మర్ధనం వల్ల అటు కాళీయునికీ ఇటు కాళిందిని రక్షించి జనానికి మేలు జరిగింది!.
అలా అందరూ కాళీయుడి విషవాయువుల నుంచి విముక్తి పొందారు. యమునా నది సైతం పవిత్రమైంది. ఇలా కాళీయమర్దనం స్మరించుకుంటే అనేక గ్రహదోషాలు పోతాయి.
ఇట్లు
శివ పరివారం
మా నామ గీత అమృతం లో కూడా ఒక పద్యం ఉంది
వందేకాళియ గర్వనాశన కరం వందే జగజ్జీవనం వందే యాదవకాంతవస్త్ర హరణం వందేత్రిమూర్త్యాత్మకం వందే నారద శంకరాది వినుతం వందే రమావల్లభం వందే కౌస్తుభ రత్న భూషణధరం వందే సుభక్తప్రియమ్.

No comments:
Post a Comment