ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ
పరమేశ్వర సంకల్పం తో మనం నిత్యం జరిగే శ్రీ మద్ భాగవతము గంగా ప్రవాహం వలె గత సం నుంచి మన పూజ్య గురువుగా గారు ఒక యాగ్యం చేసినట్టు శ్రీ మద్ భాగవతం ను మనకు మన శివ లోక కల్యాణార్థం సంకల్పించి మనకు ప్రవచన రూపం లో తెలియాని ఎన్నో విశేషాలు ను మనకి అర్ధమయ్యిలే భాషల్లో తెలియచేసారు.. ఎంతైనా మన గురువు గారు అధ్యాపన వృత్తి లో ఉన్నారు , పిల్లలకి ఎలా చెపితే అర్ధం అవుతుందో అదే విధం గా మా అందరికీ తెలియయచేసారు
శ్రీకృష్ణ సౌందర్యాన్ని సహృదయ హృదయంగమంగా సంస్కృతంలో మహా కవులు వర్ణించారు. శుభాకృతులైన ఆ కృతులలో జయదేవుని “గీత గోవిందం”. లీలాశుకుడు “శ్రీకృష్ణ కర్ణామృతం”, నారాయణ తీర్థులవారి “శ్రీకృష్ణ లీలాతరంగిణి” ప్రధానంగా చెప్పుకోదగ్గవి. ఇక తెలుగులో శ్రీ కృష్ణుని లీలావిలాసాలను ఎఱ్ఱన మహాకవి తన హరివంశంలో సుమనో మజ్జంగా చిత్రించాడు. తరువాత బమ్మెర పోతన్నగారి భాగవత దశమస్కంధం కృష్ణావతార వైభవాన్ని అత్యంత హృదయంగమంగా, అద్వితీయంగా, అనన్య సామాన్యంగా అభివర్ణించింది. ఒక విధంగా చెప్పాలంటే దశమ స్కంధం “మహానందాంగనా డింభకుని లీలా సర్వస్వమని భావించవచ్చు. దేవకీ గర్భస్థుడైన భగవంతుని బ్రహ్మాది దేవతలు ప్రార్థిస్తాడు.అటువంటి పోతనామాత్యులు శ్రీ మద్ భాగవతం ను మన గురువు గారు యధాతదం గా మనకి కళ్ళకి కట్టించినట్టు , ఒక వైపు దృశ్య కావ్యం గా కూడా మనకి చూపించే ప్రయత్నం చేసారు
ఇంకో విశేషం ఏమిటంటే మనకి దశమ స్కంధం తో పాటు లీలాశుకుడు “శ్రీకృష్ణ కర్ణామృతం”, ను సవివరం గా మనకి తెలియాచేసారు
కొన్ని ముఖ్యమైన శ్లోకాలు తో ఈ దశమ స్కంధం విశేషాలు ను అందించే ప్రయత్నం చేస్తాను
ఏమి నోము ఫలమొ ఇంత ప్రాద్దోక వార్త, వింటి మబలలార! వీను లలర మన యశోద చిన్ని మగవానిఁ గనె వంట; చూచి వత్తమమ్మ! సుదతులారా
అనుకుంటూ యశోద ఇంటికి వస్తున్న ప్రజకాంతల ఉత్కంఠను పోతన్నగారు ఈ విధంగా వివరించారు.
వేడుకతోడఁ గ్రొమ్ముడులు వీడఁ గుచోపరిహారరేఖ ల
ల్లాడఁ గపోల పాలికల హాటక పత్రరుచుల్ వినోదనం
బాడఁ, బటాంచలంబు లసియాడఁగఁ జేరి యశోదయింటికిం
జేడి లేఁగి చూచి రాగి, జిష్ణుని విష్ణునిఁ జిన్ని కృష్ణునిన్.
అలా వచ్చిన గోపాంగనలు తెచ్చిన కానుక లిచ్చి, చిన్ని పాపనికి తల అంటి, పసుపు పూసి, స్నానం చేయించారట. నీళ్లు చుట్టు తిప్పి, రక్ష పెట్టి, తొట్టెలో ఉంచి జోలపాడారట
జోజో కమలదళేక్షణ, జోజో మృగరాజమధ్య! జోజో కృష్ణా
జోజో పల్లవ కరపద, జోజో పూర్ణేందువదన! జోజో యనుచున్
గొల్ల యిల్లాండ్రు అలా జోల పాడుతూ ఊపుతూ ఉంటే దొంగ నిద్దుర పోతున్న బాలకృష్ణుణ్ణి,పోతన్నగారు ఈ విధంగా వివరించారు.
ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బయిన శ్రీమహాభాగతం బను మహాపురాణంబు నందు శ్రీకృష్ణ కథామృత మైన దశమస్కంధం చాల చాల ఉత్కృష్ణమైనది , అందులో శైశవలీలలు, వెన్నదొంగ ముచ్చట్లు, చల్దులు గుడుచుట, పూతన సంహారాలు, కాళియ మర్థనం, గోవర్థన గిరి ధారణ, రాసక్రీడావర్ణన, రుక్మిణీకల్యాణం మున్నగు ఈ స్కంధభాగం పూర్వభాగం లోని ఘట్టాలు అన్ని సుధలు స్రవించే, చెవులూరించే, భక్తిముక్తి ప్రయుక్తాలే, బహుళార్థ సాధకాలే, బహుశాస్త్ర సంశోభితాలే. పద్యాల అమృతగుళికల అబ్బో ఎన్నెన్నో.వరించడం కన్నా ఆ అమృతం ను ఆస్వాదిస్తేనే చాల బాగుంటుంది
ఓ యమ్మ! నీ కుమారుఁడు
మా యిండ్లను బాలు పెరుగు మననీ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మా యన్నల సురభులాన మంజులవాణీ!
నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయుమమ్మ! ని
న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!
ఇలా ఎన్నని ఇక్కడ ఎంచగలం. ఇలాంటి పద్యాల ప్రసాదం పంచిన పోతన మహానుభావులకు సాష్టాంగ ప్రణామాలు ఈ రామ కృష్ణులు ద్వారా మనకి ఆ పరమేశ్వర శ్రీ మధ్ భగవతం వినే భాగ్యం కలిగినది
ఆంధ్ర సాహిత్య సరస్వతీ పద నూపుర ధ్వనులెంత మధురిమలు? ఐనా..వచన రచనకు పోతనకు మించిన వారు ఎవరూ లేరు..నైమిశారణ్య వర్ణనం, నృసింహ ఆవిర్భావ ఘట్టం, వైకుంఠ వర్ణనం, రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్మిణి వర్ణనం, ద్వారకా పురి వర్ణనం, ఇలా ఆంధ్ర మహా భాగవతం మొత్తం అద్భుతమైన వచన రచనా విలాసంతో నిండి వున్నది. తెలుగు కవులలో భక్తికి గానీ,పాండిత్యానికి గానీ, వేదాంతానికి గానీ, నిజాయితీ తో కూడిన అత్మాభిమానానికి గానీ, వినయంలో గానీ,విచక్షణ లో గానీ, మృదువైన, మెత్తనైన, సంగీతమయమైన. ఆర్ద్రమైన, ఆనందాంబుధిలో ముంచెత్తే అమర భాగీరధీ ప్రవాహ సమాన పవిత్రతలో గానీ.. శ్రీ పోతనామాత్యులు ను మించిన వారు లేరు, రారు!

No comments:
Post a Comment